Thu Apr 25 2024 12:11:09 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ సభపై రేవంత్ జోస్యం
కేసీఆర్ సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డ జోస్యం చెప్పారు. ఒక వేళ సభ నిర్వహించినా అది ఫ్లాప్ అవుతుందని, బీరు, బిర్యానీ ఇచ్చినా ఎవరూ ఉండరని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ సభకు 25 లక్షలు కాదు కదా రెండున్నర లక్షల మంది కూడా రారని కేసీఆర్ కు నివేదికలు అందాయని ఆయన పేర్కొన్నారు. ఇవాళ నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశం తర్వాత సభ వాయిదాను ప్రకటిస్తారని ఆయన అంచనా వేశారు. ఆగస్టు 15 లోపు ఇంటింటికీ నల్లా నీళ్లిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి మజ్లీస్ తో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story