ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రణబ్...?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా భిన్న దృవాలు. ఆయా పార్టీ మధ్య కూడా ఈ విభేదాలు ఉంటాయి. అంతేకాదు మహాత్మ గాంధీని హత్య చేసింది కూడా ఆరెస్సెస్ యేనని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే విమర్శలు చేశాడు. అయితే, ఇంతలా విభేదాలున్న నేపథ్యంలో ఓ ఆహ్వానం ఇప్పుడు రాజకీవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. తమ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించింది ఆరెస్సెస్. ప్రణబ్ రాష్ట్రపతి గతంలో రాష్ట్రపతి పదవి చేపట్టినా, ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది.
హాజరవుతారా..?
ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ లోని రషీంభాగ్ లో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో తృతియ వర్ష్ వర్గ్ పేరుతో మూడేళ్ల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శిక్షణ అనంతరం ప్రతీ సంవత్సరం జూన్ లో నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆరెస్సెస్ నాయకత్వం ఎవరైనా ప్రముఖులను ముఖ్యఅతిథులుగా పిలుస్తుంటారు. ఈ యేడాది జూన్ 7న జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారు ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించారు. అయితే, ప్రణబ్ మాత్రం తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆరెస్సెస్ తో కాంగ్రెస్ కి ఉన్న విభేదాల దృష్యా ఒకవేళ ఆయన ఈ వేడుకకు హాజరైతే కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.