Sat Apr 27 2024 01:04:53 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లోనే కొనసాగుతా.. సొంత ప్రయోజనాలు లేవు
సచిన్ పైలట్ కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు. ఆయన ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నానని సచిన్ పైలెట్ తెలిపారు. [more]
సచిన్ పైలట్ కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు. ఆయన ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నానని సచిన్ పైలెట్ తెలిపారు. [more]
సచిన్ పైలట్ కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు. ఆయన ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నానని సచిన్ పైలెట్ తెలిపారు. రాజస్థాన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడతానని సచిన్ పైలట్ తెలిపారు. తనకు సొంత ప్రయోజనాలు ఏవీ లేవని, పార్టీ సిద్దాంతాల ప్రాతిపదికనే సమస్యలను లేవనెత్తానని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా సచిన్ పైలట్ లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
Next Story