Sat Apr 20 2024 16:34:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీని వదలని కరోనా.. పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 57 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 57 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 48 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 57 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,719 కేసులు నమోదయినట్లయింది. ప్రస్తుతం 759 మంది చికిత్స పొందుతున్నారు. 1903 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ 48 కేసుల్లో నాలుగు కేసులు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారే. వారు చిత్తూరు జిల్లా వాసులు. 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనా కారణంగా మరణించారు.
Next Story