Sat Apr 20 2024 01:30:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడిపర్తిలో టెన్షన్..టెన్షన్
తాడిపత్రికి సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమం వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అక్కడ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. నిన్న అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసి దివాకర్ రెడ్డి ప్రభోదానంద స్వామిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జేసీ పోలీసుల వ్యవహార శైలిని కూడా ఎండగట్టారు. పోలీసుల వైఫల్యం వల్లనే ప్రభోదానందస్వామి శిష్యులు దాడి చేశారని జేసీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు ప్రభోదానంద స్వామి ఆశ్రమం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. భక్తులు ఎవరూ ఆశ్రమంలోకి రావద్దని ఆంక్షలు విధించారు. దీనిపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారు.
Next Story