Wed Apr 24 2024 23:56:01 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి మరో టీడీపీ నేత
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త బుర్రా అనిల్(అనుబాబు) సోమవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందునే టీడీపీని వీడినట్లు ఆయన ప్రకటించారు. తాను టిక్కెట్ ఆశించి పార్టీ మారడం లేదని, వైసీపీలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తాను పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.
Next Story