Sat Apr 20 2024 08:36:54 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రమేష్ కు ఊహించని షాక్
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన శుక్రవారం కడపలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలను ఆ పార్టీ ఆహ్వానించింది. అయితే, సీఎం రమేశ్ దీక్షకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేతలు, ఇద్దరుముగ్గురు ప్రజాసంఘాల నేతలు మాత్రమే హజరయ్యరు. దీంతో ఆ పార్టీ నేతలకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Next Story