Wed Apr 24 2024 10:22:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కొడంగల్ లో దాడులు... ఉద్రిక్తత
తెలంగాణలో హాట్ సీట్లలో ఒకటిగా ఉన్న కొడంగల్ లో పోలింగ్ జరుగుతుండగా దాడులతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలంలోని నాగులపల్లిలో టీఆర్ఎస్ నేత మడిగ శ్రీను అనేక వ్యక్తి, ఆయన సోదరుడిపై కాంగ్రెస్ నేతలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి దాడికి దిగారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ప్రతి దాడి చేయగా వారిద్దరికీ గాయాలయ్యారు. నలుగురికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
Next Story