Thu Apr 25 2024 04:13:44 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో రాజధాని ఏర్పాటు ఖాయం
విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగినట్లు అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే విశాఖలో [more]
విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగినట్లు అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే విశాఖలో [more]
విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగినట్లు అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. భూమి విలువ ఆధారంగానే ఇంటి పన్నును పెంచడం జరుగుతుందన్నారు. విశాఖలో భూములు తాక్టటు పెడుతున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పాత సంప్రదాయమేనని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకునేటప్పుడు ఆస్తులు గ్యారంటీగా చూపుతామని విజయసాయిరెడ్డి వివరించారు. దీనికి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story