విజయసాయి టీటీడీ మే సవాల్...!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. నిప్పు నాయుడు, పప్పు నాయుడు అంటూ చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో అక్రమాలు జరిగాయనే తన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, విచారణలో చంద్రబాబు నాయుడు నిర్దోషిగా తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ నోటీసులు తనకు అందలేదని, నోటీసులు అందితే చట్టపరంగానే ఎదుర్కంటానన్నారు. నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ మెంబర్ గా పనిచేశానని, తనకున్న సమాచారం ప్రకారం టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారాలే లేవన్నారు. తాను మొత్తం 14 అవినీతి ఆరోపణలు చేశానని, వాటిలో దేనిపైనైనా సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.