కోనసీమలో సూపర్ హిట్...!
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లో జగన్ పాదయాత్రతో దుమ్ము రేపుతున్నారు. వైసిపి శ్రేణుల అంచనాలకు మించి జనం జగన్ పాదయాత్రలో పాదం కదుపుతూ సాగుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో, పి గన్నవరం నియోజకవర్గం లోని గ్రామాలు ముఖ్యంగా గంటి గన్నవరం ఏరియాల్లో జనం తండోపతండాలుగా జగన్ ను చూసేందుకు ఎగబడ్డారు. మండు వేసవిని తలపించేవిధంగా ఎండలు ఉన్నప్పటికీ వైఎస్ తనయుడిపై అభిమానంతో ప్రజలు తరలివస్తున్నారు. రావులపాలెం, పి గన్నవరం సభలు సూపర్ హిట్ కావడంతో రాజోలు నియోజకవర్గంలో జగన్ సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గన్నవరం అక్విడెక్ట్ పై సాగిన జగన్ ...
డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ పై జగన్ పాదయాత్ర అందరిని ఆకట్టుకుంది. కోనసీమ కొబ్బరి తోటలు సెంట్రల్ డెల్టా కాలువలు, గోదావరి ఏటిగట్టు లపై జగన్ పాదయాత్ర సరికొత్త రీతిలో సాగుతుంది. దారిపొడవునా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలు, వృద్ధులు, వృత్తి పనివారు, వికలాంగులకు అధిక సమయాన్ని వైసిపి చీఫ్ కేటాయిస్తున్నారు. ఎవరు ఏ సమస్య చెప్పినా ఓపిగ్గా వింటూ వైసిపి అధికారంలోకి వస్తే వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీలు గుప్పిస్తూ ముందుకు వెళుతున్నారు జగన్. 193 వ రోజు పాదయాత్ర నాగుల్లంక చేరుకున్నాకా రాత్రి బస చేయనున్నారు వైసిపి అధినేత. బుధవారం సాయంత్రం రాజోలు లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- east godavari district
- janasena party
- konaseema
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కోనసీమ
- జనసేన పార్టీ
- తూర్పుగోదావరి జిల్లా
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ