Sat Apr 20 2024 14:04:00 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందుల నుంచి జగన్ పోటీ చేయరా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల నుంచి పోటీ చేయరని, మరో స్థానం కోసం వెతుక్కుంటున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని అభిప్రయపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లు అందించడంతోనే జగన్ పని అయిపోయిందన్నారు. విభజన హామీల అమలుకోసం కేంద్రంపై పోరాటం చేయలేని జగన్, పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం జగన్ ఒక్కసారైనా పోలవరం సందర్శించారా? అని ప్రశ్నించారు. పోలవరంఅంచనాలు పెంచామని ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని దేవిదేని ఢంకా భజాయించారు.
Next Story