Wed Apr 24 2024 19:22:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ పాదయాత్ర?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు పాదయాత్రకు విరామమిచ్చారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పాదయాత్రకు ఈరోజు విరామం ఇచ్చినట్లు వైసీపీ పార్టీ కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరిగి గురువారం పాదయాత్ర యధావిధిగా ప్రారంభం కానుంది.
Next Story