జగన్ యాత్ర.....టెన్షన్..టెన్షన్....?
ఇటు వైసీపీ అధినేత జగన్, అటు జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కల్గించేలా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడం, దానికి ప్రతిగా పవన్ దాడులు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటన కొనసాగుతుంది.
అప్రమత్తమయిన పోలీసులు....
ఈ నేపథ్యంలో జనసేన, వైసీపీ ల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నివేదిక అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ పాదయాత్రలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జగన్ ప్రయివేటు సెక్యూరిటీ కూడా అప్రమత్తమయింది. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కు వీరాభిమానులు ఉండటంతో ఎవరైనా కోడిగుడ్లతో దాడులు వంటివి జరుపుతారేమోనన్న అనుమానంతో జగన్ ప్రయివేటు సెక్యూరిటీ అన్ని చర్యలు తీసుకున్నట్లు వైసీపీ నేత ఒకరు చెప్పారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- praja sankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ