Thu Mar 28 2024 08:25:55 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, వైసీపీ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని యనమల [more]
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, వైసీపీ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని యనమల [more]
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, వైసీపీ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని యనమల చెప్పారు. దక్షిణాదిలో అత్యధిక కేసులున్న రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. పరీక్షలు ఎక్కువ చేస్తున్నందునే కేసులు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనను యనమల రామకృష్ణుడు కొట్టిపారేశారు. పెరుగుతున్న కేసులను తగ్గించి చూపడానికే ప్రభుత్వం పరీక్షలు ఎక్కువగా చెబుతుందని యనమల అభిప్రాయపడ్దారు. జగన్ చేతకానితనం వల్లనే కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రబలిపోయిందని యనమల ఆరోపించారు.
Next Story