స్టేలు ఎత్తివేయించుకోవడంతోనే టైమ్ సరిపోతుంది
ప్రజల కోసం ఏ పని చేద్దామనుకున్నా టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాను పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేద్దామనుకుంటే అడుగడుగునా [more]
ప్రజల కోసం ఏ పని చేద్దామనుకున్నా టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాను పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేద్దామనుకుంటే అడుగడుగునా [more]
ప్రజల కోసం ఏ పని చేద్దామనుకున్నా టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాను పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేద్దామనుకుంటే అడుగడుగునా అడ్డు తగులుతున్నా రన్నారు. ఒంగోలులో దామచర్ల జనార్థన్, కాకినాడలో టీడీపీ నేత కొండబాబులు దగ్గరుండి కోర్టుల్లో పిటీషన్లు వేయించారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయించడం, కోర్టుల కెళ్లి స్టే తెచ్చుకోవడం ఒక పద్థతి ప్రకారం చంద్రబాబు చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో సీపీఐ నేత లోకనాధం పిటీషన్ వేశారన్నారు. చంద్రబాబుకు, కమ్యునిస్టులకు ఉన్న సంబంధాలు ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ చేసినట్లుగా మ్యానేజీ చేయలేకపోతున్నామన్నారు. అసత్య కథనాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోర్టుల్లో స్టేలు ఎత్తివేయించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇది మనకు పట్టిన ఖర్మ అని జగన్ అన్నారు. ఇలా ప్రతి మంచి పనికీ టీడీపీ అడ్డుతగులుతుందని జగన్ ఆరోపించారు. అయితే వీటన్నింటిని అధిగమించి ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళతామన్నారు.