Fri Mar 29 2024 02:09:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్వీ రమణపై జగన్ ఆరోపణలను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
గత ఏడాది అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ [more]
గత ఏడాది అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ [more]
గత ఏడాది అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని జగన్ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అంతర్గతంగా విచారించిన సుప్రీంకోర్టు ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. అంతర్గత విచారణ చేయడంతో దాని వివరాలను బయటపెట్టలేదు. విచారణలో ఏమీ తేలకపోవడం వల్లనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే రాష్ట్రపతికి ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేసింది. ఎన్వీరమణ పేరు సిఫార్సు చేయడంతోనే జగన్ ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లయింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలయింది.
Next Story