జగన్ తనకు తానే పొగుడుకున్నారే
జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ జగన్ తనను తాను పొగుడుకోరు. ఎవరైనా పొగిడితే చిరునవ్వుతో చూస్తారు. అయితే ఈసారి జగన్ మాత్రం ఆయనకు ఆయనే పొగుడుకోవడం, తనకు [more]
జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ జగన్ తనను తాను పొగుడుకోరు. ఎవరైనా పొగిడితే చిరునవ్వుతో చూస్తారు. అయితే ఈసారి జగన్ మాత్రం ఆయనకు ఆయనే పొగుడుకోవడం, తనకు [more]
జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ జగన్ తనను తాను పొగుడుకోరు. ఎవరైనా పొగిడితే చిరునవ్వుతో చూస్తారు. అయితే ఈసారి జగన్ మాత్రం ఆయనకు ఆయనే పొగుడుకోవడం, తనకు తానే ప్రశంసించుకోవడం తొలిసారి కన్పించింది. చిత్తూరు జిల్లాలో అమ్మవొడి కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తాను అమ్మవడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఈ పథకం అమలుకావడం లేదన్నారు. అంతేకాదు మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టే మెనూను కూడా తానే డిసైడ్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. పిల్లలకు అందించే ఆహారం విషయంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకూ శ్రద్థ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిచడం కోసం మెనూ ను రూపొందించానని సోమ నుంచి శనివారం వరకూ మెనూ ను చదివి విన్పించారు. గతంలో ఎక్కడా జగన్ ఈ విధంగా మాట్లాడకపోవడం గమనార్హం.