దిక్కుమాలిన టీడీపీ
దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ, అన్యాయమైన టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బిల్లులు శాసనమండలిలో [more]
దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ, అన్యాయమైన టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బిల్లులు శాసనమండలిలో [more]
దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ, అన్యాయమైన టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బిల్లులు శాసనమండలిలో తిరస్కరణకు గురయితే ఇక్కడ మళ్లీ తిరిగి ఆమోదం పొందే ప్రయత్నం తాము చేస్తుంటే అసెంబ్లీలో అడ్డుకుంటున్నారన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని జగన్ ఆరోపించారు. మాల, మాదిగ, రెల్లి ఇతర కులాల వారికి విడిగా మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తే దానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. బిల్లులు పాస్ కాకుండా చేసే చరత్ర టీడీపీది అని జగన్ అన్నారుర. టీడీపీ సభ్యులు ఏం చేస్తున్నారో? వారికే అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ నియోజకవర్గాలన్నింటినీ దాదాపుగా గెలుచుకున్నామని, టీడీపీ, జనసేనల తరుపున ఒక్కొక్కరే శాసనసభ్యుడిగా గెలిచారన్నారు. ఎస్సీలందరూ ఒక్కటేగా ఉండాలన్నదే తమ ప్రయత్నమన్నారు.