Thu Apr 25 2024 16:44:14 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడుపై జగన్ ఆరా
తెలుగుదేశం నేతల అరెస్ట్ లు, కొనసాగుతున్న ఆందోళనలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాజకీయ [more]
తెలుగుదేశం నేతల అరెస్ట్ లు, కొనసాగుతున్న ఆందోళనలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాజకీయ [more]
తెలుగుదేశం నేతల అరెస్ట్ లు, కొనసాగుతున్న ఆందోళనలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాజకీయ లబ్దికోసం చేస్తున్న ఆందోళనలు ప్రజల జీవనానికి ఆటంకం కల్గించకుండా చూడాలని జగన్ ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడవద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే ముఖ్యమని, రాజకీయ పార్టీలు తర్వాత అని పోలీసులకు ఉద్భోదించారు. కాగా టీడీపీ నేతలను ఏపీలో ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
Next Story