తగ్గేదేలేదన్న జగన్
మూడు రాజధానులను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాకుంటే కొద్దిగా జాప్యం జరుగుతుందే కాని మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని జగన్ కుండబద్దలు [more]
మూడు రాజధానులను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాకుంటే కొద్దిగా జాప్యం జరుగుతుందే కాని మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని జగన్ కుండబద్దలు [more]
మూడు రాజధానులను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాకుంటే కొద్దిగా జాప్యం జరుగుతుందే కాని మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని జగన్ కుండబద్దలు కొట్టేశారు. ఆంగ్ల మీడియా ప్రతినిధులతో జగన్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చామన్నారు. అమరావతిని అంత ఖర్చుతో నిర్మించడం ఇప్పట్లో సాధ్యం కాదని జగన్ చెప్పారు. అందులో పదో వంతు ఖర్చు చేస్తే విశాఖపట్నం చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
సంక్షేమం… అభివృద్ధి…..
అమరావతిలో రాజధానిని తొలగించడం లేదని, అక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ ను కొనసాగిస్తామని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్న రైతులు ఎవరికీ అన్యాయం చేయబోనని కూడా జగన్ మాట ఇచ్చారు. బీజేపీలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అసెంబ్లీలో బిల్లులు పెట్టకుండానే రాజధానులు ఏర్పాటు చేయవచ్చని, కానీ ప్రజాస్వామ్యపద్ధతిలో వెళ్లాలనే బిల్లులు పెట్టామన్నారు. ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనిస్తుందని జగన్ అన్నారు.