Fri Mar 29 2024 05:55:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో ఇంటింటికి తిరిగి?
ఆంధ్రప్రదేశ్ లో నేడు పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పనులు లేకపోవడంతో ప్రతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయలు [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పనులు లేకపోవడంతో ప్రతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయలు [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పనులు లేకపోవడంతో ప్రతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటింటికి గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ నగదును అందించనున్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 28 లక్షల మంది కుటుంబాలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి 1300 కోట్లు అవసరమవుతుంది. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
Next Story