ఆ మూడు జిల్లాలతోనే ముప్పు… జాగ్రత్తలు తీసుకోండి
కరోనా వైరస్ పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 14 రెడ్ జోన్లను గుర్తించారు. ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా [more]
కరోనా వైరస్ పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 14 రెడ్ జోన్లను గుర్తించారు. ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా [more]
కరోనా వైరస్ పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 14 రెడ్ జోన్లను గుర్తించారు. ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నివారణకు కొత్త నిబంధనను ఏపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను నమిలి రోడ్డుపై ఉమ్మివేయడాన్ని నిషేధించింది.