ధైర్యంగా అడుగులు వేస్తున్నా
ఎందరో దేశ భక్తుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ [more]
ఎందరో దేశ భక్తుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ [more]
ఎందరో దేశ భక్తుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శకటాలను తిలకించారు. విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవాడేనని, ఆయనను ఎన్నటికీ మర్చి పోకూడదన్నరారు. మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలని, మన తలరాతలను మనమే మార్చుకోవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
యాగీ యాగీ చేస్తున్నారు….
ఆగస్టు 15వ తేదీ అంటే కేవలం జెండా ఎగురవేయడమే కాదని, ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని అన్నారు. విభజించి పాలించే ఆలోచనలు పోవాలని జగన్ అన్నారు. కులాలు, మతాలు చెరిగిపోవాలని, మానవత్వం వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. ఇందుకు సంఘ సంస్కరణలు రావాలన్నారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసమే నవరత్నాలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కొన్ని కులాలు, మతాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీని నుంచి బయటకు రావాలని పిలుపు నిచ్చారు. కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా రాష్ట్రానికి మేలు చేద్దామని భావిస్తుంటే రాజకీయం చేస్తూ కొందరు యాగీ యాగీ చేస్తున్నారన్నారు. అధికార, అవినీతి నీళ్లు,పాలలా కలసి ఉంటాయని వదిలేయాలా? అని జగన్ ప్రశ్నించారు.
చరిత్ర గతిని మార్చే…..
తాను చరిత్రగతిన మార్చే విధంగా చట్టాలను తీసుకొచ్చామన్నారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్ కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. రెండున్నర నెలల్లోనే అనేక ప్రజోపయోగమైన సంచలనాత్మక నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. రైతుల సంక్షేమంలో భాగంగా వ్యవసాయానికి 9గంటల పగటి పూట విద్యుత్తును ఇస్తున్నామని చెప్పారు. ఆక్వారైతులకు 1.50పైసలకే యూనిట్ విద్యుత్తును అందిస్తున్నామని జగన్ చెప్పారు. గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మద్యనిషేధానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని జగన్ చెప్పారు. తాను అనేక నిర్ణయాలను తీసుకుని ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.