Thu Apr 25 2024 12:23:57 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో గర్జిస్తున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల అమలులో బీజేపీ, టీడీపీ మోసాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో వంచనపై గర్జన దీక్షను తెలపెట్టింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, యువత తరలివచ్చారు. వైసీపీ నేతలతా బీజేపీ, టీడీపీ వంచనకు నిరసిస్తూ నల్లబట్టలు ధరించి దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లుగా చేస్తోంది కేవలం మోసం, వంచన, దగా మాత్రమేనని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తన ఉందని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను, వంచనను ప్రజలకు చెప్పడమే వైసీపీ లక్ష్యమని పేర్కొన్నారు.
Next Story