ఇక రక్షకుడు ఆయనేనట… అది సాధ్యమవుతుందా?
టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో చేసిన కామెంట్స్ ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. ప్రధానంగా గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు అనేక కామెంట్స్ చేశారు. గవర్నర్ వ్యవస్థను తొలగించాలని కోరారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో చేసిన కామెంట్స్ ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. ప్రధానంగా గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు అనేక కామెంట్స్ చేశారు. గవర్నర్ వ్యవస్థను తొలగించాలని కోరారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో చేసిన కామెంట్స్ ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. ప్రధానంగా గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు అనేక కామెంట్స్ చేశారు. గవర్నర్ వ్యవస్థను తొలగించాలని కోరారు. కేంద్రం పెత్తనం చేయడానికే గవర్నర్ వ్యవస్థను తీసుకొచ్చిందని చంద్రబాబు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం గూఢాచారులుగా ఉపయోగించుకుంటుందన్న తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు.
గవర్నర్ అంటేనే?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే తాము గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అదే గవర్నర్ చేత పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారనుకోండి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు చంద్రబాబుకు అసలు పడేది కాదు. నరసింహన్ తమపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారని చంద్రబాబు బహిరంగంగానే ఆరోపించారు.
ఇప్పటికి పదిసార్లకు పైగానే…?
నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంచిగా, తమ పట్ల వ్యతిరరేకతతో ఉండే వారని అంతర్గత సంభాషణల్లో సయితం టీడీపీ నేతలు వ్యాఖ్యానించేవారు. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే తీసిపారేసిన చంద్రబాబుకు ఇప్పుడు అదే గవర్నర్ దిక్కయ్యారు. చలో రాజ్ భవన్ అని నిత్యం టీడీపీ నేతలు అంటుండటమే ఇందుకు కారణం. గవర్నర్ ను ఈ మధ్య కాలంలో ఇక పది సార్లకు పైగానే టీడీపీ నేతలు కలిశారు.
ఎమ్మెల్యే అరెస్ట్ పై కూడా…
ఇక చంద్రబాబు స్వయంగా కూడా అనేక సార్లు గవర్నర్ ను కలసి జగన్ పై ఫిర్యాదు చేశారు. శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇక చివరకు ఎమ్మెల్యే అరెస్ట్ ను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో రాజ్ భవన్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. చిన్న చిన్న విషయాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో బాబు బేలతనం బయటపడటం తప్ప మరే ప్రయోజనం ఉండదన్నది పార్టీ నేతలే చేస్తున్న వ్యాఖ్యలు. మరి చివరకు గవర్నర్ ఇప్పుడు చంద్రబాబుకు రక్షకుడిగా కనపడుతున్నట్లుందన్న కామెంట్స్ సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతున్నాయి.