జగన్ పై కోపం అందుకేనట
నిజానికి భౌతికంగా చూసుకున్నా కమలం పువ్వుకు కొడవలితో ఆగర్భ వైరమే. కొడవలి దూశాక కమలం ఎక్కడుంటుంది. ఈ రెండింటికీ ప్రకృతి తెచ్చిన శత్రుత్వం అలాగే ఉంటుంది. దేశ [more]
నిజానికి భౌతికంగా చూసుకున్నా కమలం పువ్వుకు కొడవలితో ఆగర్భ వైరమే. కొడవలి దూశాక కమలం ఎక్కడుంటుంది. ఈ రెండింటికీ ప్రకృతి తెచ్చిన శత్రుత్వం అలాగే ఉంటుంది. దేశ [more]
నిజానికి భౌతికంగా చూసుకున్నా కమలం పువ్వుకు కొడవలితో ఆగర్భ వైరమే. కొడవలి దూశాక కమలం ఎక్కడుంటుంది. ఈ రెండింటికీ ప్రకృతి తెచ్చిన శత్రుత్వం అలాగే ఉంటుంది. దేశ రాజకీయాల్లో కూడా కమలం పువ్వు పార్టీకి, కామ్రేడ్లకు అసలు పడదు. వారు అవును అంటే వీరు కాదు అంటారు. వారు బాగుంది అంటే వీరు బాగలేదు అంటారు. కానీ చిత్రంగా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒకే భావజాలంతో ఈ రెండు పార్టీలు ఉండడం విశేషమే మరి. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కమలం కత్తులు దూస్తోంది. జగన్ పాలన బాగాలేదని, ఆయనకు పాలించడం రావడంలేదని టీడీపీ కంటే దూకుడుగా నోరు చేసుకుంటోంది. మొదట్లో దీన్ని చూసి విస్మయం చెందినా కూడా వైసీపీకి కమలం పోకడలు ఏంటో అర్ధమయ్యాక సరేనని సర్దుకుంది. కానీ కమలానికి పూర్తి వ్యతిరేకమైన కూడా జగన్ విషయంలో కామ్రేడ్స్ గొంతు కలపడమే అసలైన వింత అంటున్నారు.
చిరకాల డిమాండ్లు తీర్చినా….
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది వామపక్షాల చిరకాల డిమాండ్. దానికి మరో మాట లేకుండా జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆమోదముద్ర వేశారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు. అంగన్ వాడీల జీతాలతో పాటు, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు 18 వేలు చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నింటికంటే ముఖ్య విషయం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భారీ వాటాను జగన్ ఇచ్చారు. మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా తీసుకున్నారు. అలాగే కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఏపీలో అవినీతి లేని పాలన సైతం సాగుతోంది. సంక్షేమ రాజ్యంగా ఏపీని జగన్ మలచారు. గిరిజనుల ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకుండా చంద్రబాబు జీవోను రద్దు చేసి చూపించారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తూ యువతకు అవకాశాలు పెంచారు. ఇన్ని చేసిన జగన్ ఆరు నెలల పాలనపైన వామపక్షాలు విమర్శలు చేయడం ఏ రకమైన ఆలోచనో అర్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అదే కోణమా..?
నిజానికి వామపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాయని పేరు. వారు వివక్షకు తావు లేకుండా విశాల ప్రజల ప్రయోజనాల కోణం నుంచే ప్రతీ నిర్ణయాన్ని తూకం వేస్తాయని అంటారు. అలా చూసుకున్నపుడు జగన్ పేదల పట్ల కనబరుస్తున్న చిత్తశుధ్ధి, పధకాల అమలు వంటివి ఎందుకు కామ్రేడ్స్ ని ఆకట్టుకోలేకపోయాయన్నది ఇక్కడ చర్చగా ఉంది. కామ్రేడ్స్ కి మిగిలిన పార్టీల మాదిరిగా కుర్చీ యావ లేదు. ఒకవేళ జగన్ దిగిపోతే తాము ఎక్కాలన్న దురాలోచన అసలు లేదు. మరి జగన్ ఆరు నెలల పాలన అంతా ఏకపక్షంగా సాగిందని సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణ అంటున్నారంటే ఆయన ఏ కోణం నుంచి విశ్లేషించుకున్నారా అన్న ఆలోచనలు వస్తున్నాయి.
సిధ్ధాంత రాధ్ధాంతమా..?
అయితే ఇక్కడ కూడా కామ్రేడ్స్ కి సిధ్ధాంత కోణం ఒకటి ఉందని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధమవుతోంది. బీజేపీ విమర్శల వెనక రాజకీయ యావ ఉంటే కామ్రేడ్స్ కామెంట్స్ వెనక సిధ్ధాంత రాధ్ధాంతం ఉందని అంటున్నారు. జగన్ బీజేపీతో అంటకాగుతున్నాడన్న అనుమానం అయినా ఉండాలి. భవిష్యత్తులో చేతులు మళ్ళీ కలుపుతాడన్న ఆలోచన అయి ఉండాలి. అందుకే ఆ కోణం నుంచే కామ్రేడ్స్ జగన్ని దూరం పెడుతున్నాయనుకోవాలి. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ కేంద్రంలో ఎటూ విరోధం పెట్టుకోలేరు. ఏపీ బీజేపీ నేతలు నిందించినా కామ్రెడ్స్ కన్నెర్ర చేసినా జగన్ మాత్రం కేంద్రంతో సహకార ధోరణితోనే అన్నీ సాధించు కోవాలను కుంటున్నారు. మరి ఈ విధంగా చూస్తే అటు బీజేపీకి, ఇటు కామ్రేడ్స్ కి జగన్ చెడ్డ అవుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి.