నిమ్మగడ్డ మౌనం వీడింది అందుకేనా?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారా? లేక బోల్తా పడ్డారా? ఈ విషయంలో ఎవరికి వారు తామే సక్సెస్ అయ్యామని [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారా? లేక బోల్తా పడ్డారా? ఈ విషయంలో ఎవరికి వారు తామే సక్సెస్ అయ్యామని [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారా? లేక బోల్తా పడ్డారా? ఈ విషయంలో ఎవరికి వారు తామే సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ గత నెల 19వ తేదీన రాశారు. అంటే దాదాపు లేఖ రాసి 28 రోజులకు పైగానే అవుతుంది. విజయసాయిరెడ్డి నిన్న ఈ లేఖ ఫోర్జరీ అని ఫిర్యాదు చేయడంతో గంటల వ్యవధిలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనని చెప్పారు.
పదిహేను రోజుల నుంచి…..
అయితే ఇరవై ఎనిమిది రోజులు గడుస్తున్నా ఆ లేఖ పై రాద్ధాంతం జరుగుతున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెదవి విప్పలేదు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశారని చెప్పారు. ఆయన మాత్రం ఇప్పటి వరకూ తాను రాసినట్లు చెప్పలేదు. లేఖలో ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా తీవ్ర విమర్శలు చేయడం వల్లనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాసినట్లు బయటకు చెప్పలేదన్నది ఒక వాదన.
విజయసాయి ఫిర్యాదుతో….
కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఈ లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయలేదని, ఆయన సంతకం ఫోర్జరీ చేసి టీడీపీ నేతలే పార్టీ కార్యాలయంలో తయారు చేశారని ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించేనట్లేనన్నది వైసీపీ వాదన. రాజ్యాంగ పదవిలో ఉండి ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్లనే నిమ్మగడ్డపై వేటు వేశామని వైసీపీకి చెప్పుకునే వీలుంది. అంతేకాదు న్యాయస్థానంలో కూడా తమకు అడ్వాంటేజీ అని వైసీపీ అంటోంది.
ఇప్పుడేం చెబుతారంటున్న టీడీపీ….
మరోవైపు తెలుగుదేశం పార్టీ విజయసాయిరెడ్డిపై ఫైర్ అవుతోంది. విజయసాయిరెడ్డి ప్లాన్ తిరగబడిందని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఆ లేఖ ఫోర్జరీది కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖతో స్పష్టమయిందని టీడీపీ అంటోంది. నిమ్మగడ్డ మౌనాన్ని విజయసాయిరెడ్డి రాజకీయంగా వాడుకోవాలని చూశారని, కానీ ఇప్పుడు బూమ్ రాంగ్ అయిందని టీడీపీ విమర్శిస్తుంది. నేరగాళ్లు ఫోర్జరీలంటూ మాట్లాడటమేంటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందనకు టీడీపీ అపరాధి కాకూడదనేనా? అన్నది వైసీపీ ప్రశ్నగా ఉంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నిమ్మగడ్డ ఇప్పుడు తానే అంటూ ముందుకు రావడం వెనక ఆంతర్యమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐపీ అడ్రస్ పై విచారణ అనగానే తానే నిమ్మగడ్డ ముందుకు వచ్చారంటే టీడీపీ నేతలను రక్షించడానికేనన్నది వైసీపీ నేతల వాదన. మొత్తం మీద ఏపీలో నిమ్మగడ్డ వ్యవహారం రాజకీయంగా ముగిసే అవకాశం కన్పించడం లేదు.