జగన్ సరిగ్గా ఉంటే…?
భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడాలని వస్తే తనను టీడీపీ దత్తపుత్రుడినంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లాంగ్ మార్చ్ [more]
భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడాలని వస్తే తనను టీడీపీ దత్తపుత్రుడినంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లాంగ్ మార్చ్ [more]
భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడాలని వస్తే తనను టీడీపీ దత్తపుత్రుడినంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లాంగ్ మార్చ్ అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో సయితం తన గొంతు ఆగలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడ్డానన్నారు. పార్టీని నడపాలంటే కోట్లు అవసరంలేదని, భావజాలం చాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అధికారం, డబ్బుకోసం తాను వెంపర్లాడేవాడిని కాదన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. వైసీపీ నేతలు తమకు సమయం ఇవ్వలేదని విమర్శిస్తున్నారని, ప్రజలు రోడ్డెక్కారంటే ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు.
వైసీపీ తనకు శత్రువు కాదు….
రాష్ట్ర విభజన సమయంలోనూ మాట్లాడే దమ్ము వైసీపీలేక పోయిందన్నారు. తాను కోట్లు సంపాదించుకునే సినీరంగాన్నే వదులుకున్నానని చెప్పారు. రాజీకయ నాయకులు కరెక్ట్ గా ఉంటే జనసేన పార్టీ పెట్టే వాడినే కాదన్నారు. రాజకీయ నేతల వ్యవహారం వల్లనే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. జగన్ పరిపాలనపై ఇంత త్వరగా విమర్శలు చేయాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ నేతలు తనకు శత్రువులు కాదన్నారు. ఇప్పుడు మంత్రి కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తామేనని చెప్పారు. ఓడిపోయిన వ్యక్తిపై ఇంత ప్రేమ చూపించారు. ఇక తనకు ఏ పదవీ అక్కరలేదన్నారు. ఆరునెలల్లోనే వైసీపీ ప్రభుత్వం విఫలమయిందన్నారు.
కృత్రిమ కొరత సృష్టించి…
భీమవరం, గాజువాకల్లో ఓడిపోయినంత మాత్రాన తాను వైఫల్యం చెందినట్లు కాదన్నారు. నిర్మాణం జరగనిదే అభివృద్ధి లేదన్నారు. ఆ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను వైసీపీ సర్కార్ కృత్రిమ కొరత సృష్టించారన్నారు. ఇసుక అంటేనే అభివృద్ధి అని అన్నారు. జగన్ మీద తనకు ద్వేషం లేదని, ఆయన నిజంగా గొప్ప నాయకుడయితే నాకంటే సంతోషించే నాయకుడు లేరన్నారు. జగన్ అద్భుతంగా పాలిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని చెప్పారు. కానీ భవన నిర్మాణ కార్మికులపై జగన్ దృష్టి సారించాలన్నారు. తాను వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
టీడీపీతో నాకేంటి?
తాను తెలుగుదేశం పార్టీని గతంలో విభేదించానని పవన్ కల్యాణ్ చెప్పారు. వారి విధానాలను విభేదించానన్నారు. తాను టీడీపీతో కలసి పోటీ చేయలేదని చెప్పారు. అయినా జనసేన ను టీడీపీ బీ టీంగా విమర్శిస్తున్నానన్నారు. వైసీపీ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు. పాలసీ సరిగా లేనప్పుడు విమర్శిస్తామన్నారు. ఇసుకపై కొత్త పాలసీ తెస్తామంటే ఆహ్వానించానన్నారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదని, ఏకస్వామ్యం ఉందన్నారు. అధికారుల మాట కూడా వినకపోబట్టే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఏరాష్ట్రంలో లేని పరిస్థితులు ఇక్కడ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. తన అభిమానులు కూడా గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశారన్నారు. మంత్రులు జీతభత్యాలను తీసుకునే అర్హత లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడితే మీరు జీతాలు ఎలా తీసుకుంటారన్నారు.