జగన్ ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారా..? వారికి పండగేనా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లే కనపడుతుంది. మండలి రద్దుతో రాజకీయంగా తమకు నష్టమేనని భావించిన జగన్ శాసనమండలి రద్దుపై పునరాలోచనలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లే కనపడుతుంది. మండలి రద్దుతో రాజకీయంగా తమకు నష్టమేనని భావించిన జగన్ శాసనమండలి రద్దుపై పునరాలోచనలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లే కనపడుతుంది. మండలి రద్దుతో రాజకీయంగా తమకు నష్టమేనని భావించిన జగన్ శాసనమండలి రద్దుపై పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాలకు నామినేషన్లు వేయడం చూస్తుంటే శాసనమండలిని కొనసాగించాలనే జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఖాళీ అవుతున్న స్థానాలకు కూడా జగన్ అభ్యర్థులను రెడీ చేస్తుండగమే ఈ ప్రచాారనికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
శాసనమండలి రద్దు చేసినా….
సీఆర్డీఏ రద్దు బిల్లు, మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును శాసనమండలి వ్యతిరేకించడంతో జగన్ ఎనిమిది నెలల క్రితం శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. దీనిపై కేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాటు ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడుతుండటం కూడా మండలి రద్దుపై జగన్ వెనక్కు తగ్గారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒకరకంగా పార్టీలో జోష్ నింపిందనే చెప్పాలి.
అభ్యర్థిని ప్రకటించి….
శానసమండలి లో ఖాళీ అయిన ఒక స్థానానికి జగన్ తమ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఖరారు చేశారు. ఆయన ఎన్నిక లాంఛనమే. ఇది పూర్తిగా ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక కావడంతో పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎన్నికయినట్లే. ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి రావడంతో జగన్ తిరిగి ఆయనకే సీటు కేటాయించారని, సామాజికవర్గం పరంగా కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.
మరో నాలుగు స్థానాలకు కూడా…..
ఇక మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ రెండు స్థానాలను కూడా త్వరలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా వైసీపీ అకౌంట్ లోకే చేరిపోతాయి. ఈ రెండు స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు కూడా త్వరలో ఖాళీ కాబోతున్నాయి. ఇవి కూడా జగన్ పార్టీకే దక్కుతాయి. మొత్తంగా చూసుకుంే వచ్చే ఏడాది నాటికి వైసీపీ శాసనమండలిలో పూర్తి స్థాయి మెజారిటీ దక్కించుకుంటుంది. అందుకే జగన్ శాసనమండలి రద్దుపై పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాల చెబుతున్నాయి. అయితే జగన్ మనసులో ఏముందో తెలియక టెన్షన్ పడే వారు కూడా లేకపోలేదు.