పెరుగుతున్న కేసులు.. ఏపీ సర్కార్ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టింది. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ, [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టింది. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ, [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టింది. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల వద్ద నిఘాను ఏర్పాటు చేసింది. అక్కడే థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమిళనాడులో కర్ణాటక, కేరళ నుంచి రాకపోకలను నిషేధించారు. తమిళనాడులో కూడా మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 135 మంది రక్తనమూనాలను పరీక్షలకు పంపగా వారిలో 108 మందికి కరోనా లేదని తేలింది. మిగిలిన నివేదికలు రావాల్సి ఉంది. 711 మందికి ఇళ్లలోనే క్వారంటైన్ చేసినట్లు ఏపీ వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది.