Fri Apr 26 2024 10:52:43 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి ప్రజలు బుద్ధిచెప్పాలి…చంద్రబాబు పిలుపు
వైసీపీ అరాచకాలు అంతూ పొంతూ లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ [more]
వైసీపీ అరాచకాలు అంతూ పొంతూ లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ [more]
వైసీపీ అరాచకాలు అంతూ పొంతూ లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ నేత తులసీ రెడ్డిపై దాడిని చంద్రబాబు ఖండించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు రెండో విడత పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story