టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ పంపారు. [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ పంపారు. [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ పంపారు. చిత్తూరు జిల్లా కు చెందిన లలిత కుమారి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తనను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని లలితకుమారి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తానని లలిత కుమారి ప్రకటించారు. 2004లో లలిత కుమారి పలమనేరు నుంచి గెలిచారు. తర్వాత పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంగా మారడంతో ఆమె రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.