హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ప్రారంభం… కానీ?
తెలంగాణలో ఐటీ కంపెనీలు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. అయితే కేవలం 33 శాతం మంది సిబ్బందితోనే ఐటీ కంపెనీలు కార్యకలాపాలను [more]
తెలంగాణలో ఐటీ కంపెనీలు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. అయితే కేవలం 33 శాతం మంది సిబ్బందితోనే ఐటీ కంపెనీలు కార్యకలాపాలను [more]
తెలంగాణలో ఐటీ కంపెనీలు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. అయితే కేవలం 33 శాతం మంది సిబ్బందితోనే ఐటీ కంపెనీలు కార్యకలాపాలను నిర్వహించాలని పేర్కొంది.ఉద్యోగులు ఉదయం ఏడు, పది గంటలకు లాగ్ ఇన్ అవ్వాలి. అలాగే మధ్యాహ్నం మూడు, సాయంత్రం ఆరుగంటలకు లాక్ అవుట్ చేయాలి. సాయంత్రం ఆరుగంటలకు కంపెనీ కార్యకలాపాలు ముగించాల్సి ఉంటుంది. రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంది కాబట్టి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలులేదు. కంపెనీ బస్సుల్లోనూ ఉద్యోగులను తరలించేటప్పుడు సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి. అలాగే కంపెనీల్లో క్యాంటిన్లను కూడా తెరవడానికి వీలులేదు. ఈ మేరకు ఐటీ కంపెనీలకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.