రాస్కో సాంబా..కూల్చే వరకు నిద్రపోను
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ తాను నిద్రపోనని ఆయన తెలిపారు. రాజధాని రైతులతో సమావేశమైన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ తాను నిద్రపోనని ఆయన తెలిపారు. రాజధాని రైతులతో సమావేశమైన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ తాను నిద్రపోనని ఆయన తెలిపారు. రాజధాని రైతులతో సమావేశమైన పవన్ కల్యాణ్ అమరావతి ఎక్కడికీ పోదని, శాశ్వత రాజధానిగా ఉంటుందని, రాసిపెట్టుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి రాగానే అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ ఇబ్బందులు లేకుండా చట్టాలు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ తాను నిద్రపోనన్నారు. వైసీపీ ఇక ఏపీలో అధికారంలోకి రాదని, అమరావతి ఇక్కడి నుంచి కదలదని పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతిలో వైసీపీ నేతలకు భూములు ఉంటే ఇక్కడి నుంచి తరలించేవారా? అని పవన్ ప్రశ్నించారు. విశాఖలో భూములు కొనుగోలు చేసినందునే అక్కడికి తరలిస్తున్నారని, వైసీపీకి ఉత్తరాంధ్రపై పెద్దగా ప్రేమ లేదన్నారు.