Fri Apr 26 2024 06:57:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వారికి ఐదువేలు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన అర్చకులకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వివిధ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన అర్చకులకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వివిధ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన అర్చకులకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వివిధ దేవాలయాల్లో నెలవారీ జీతం లేని అర్చకులకు, ధూపదీప నైవేద్యం ద్వారా లబ్ది పొందని వారికి ఐదు వేలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాలు మూతబడ్డాయి. చిన్న దేవాలయాల్లో అర్చకులు భక్తులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జగన్ సర్కార్ వారికి ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
Next Story