Fri Apr 26 2024 08:52:54 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో మాజీ ఎంపీ కుటుంబం వైసీపీలోకి..టీడీపీకి మరో షాక్
మాజీ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తిరుమల పర్యటన సందర్బంగా జగన్ ను శ్రీనివాసులు కలిశారు. ఆయనను ఎంపీ [more]
మాజీ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తిరుమల పర్యటన సందర్బంగా జగన్ ను శ్రీనివాసులు కలిశారు. ఆయనను ఎంపీ [more]
మాజీ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తిరుమల పర్యటన సందర్బంగా జగన్ ను శ్రీనివాసులు కలిశారు. ఆయనను ఎంపీ మిధున్ రెడ్డి జగన్ కు పరిచయం చేశారు. జగన్ శ్రీనివాసులుతో పది నిమిషాలు మాట్లాడారు. త్వరలో శ్రీనివాసులు వైసీపీలో చేరే అవకాశముంది. ఆదికేశవులునాయుడు కుటుంబం ప్రస్తుతం టీడీపీ లో ఉంది. గత ఎన్నికల్లోనూ డీకే ఆదికేశవులునాయుడు భార్య రాజంపేట ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు జగన్ తో భేటీ కావడంతో ఆదికేశవులు నాయుడు కుటుంబం వైసీపీలో చేరనుంది.
Next Story